Thursday, May 2, 2024

ఎక్స్‌ప్రెస్‌ వేపై ప్రమాదం.. చిన్నారి సహా ముగ్గురు దుర్మరణం

ఉత్తరప్రదేశ్‌లోని ఉన్నావ్‌లో ఆగ్రా-లక్నో ఎక్స్‌ప్రెస్‌వేపై జరిగిన ప్రమాదంలో ముగ్గురు మరణించారు. గురువారం ఉదయం ఉన్నావ్‌ వద్ద ఆగ్రా-లక్నో ఎక్స్‌ప్రెస్‌వేపై వేగంగా వెళ్తున్న కారు టైర్లు పేలిపోయాయి. దీంతో అదుపుతప్పి బోల్తాపడింది. ఈ క్రమంలో కారును వెనుక నుంచి వస్తున్న మరో రెండు కార్లు ఢీకొట్టాయి. దీంతో అందులో ఉన్న ముగ్గురు అక్కడికక్కడే మృతిచెందారు. మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతుల్లో ఓ వ్యక్తి, మహిళ సహా ఆరు నెలల చిన్నారి ఉన్నట్లు పోలీసులు తెలిపారు. అతివేగమే ప్రమాదానికి కారణమని చెప్పారు. ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement