Friday, April 19, 2024

నేటి సినిమాల్లో అశ్లీల‌త‌..హింస పెరిగిపోతోంది – ఉప‌రాష్ట్ర‌ప‌తి వెంక‌య్య‌నాయుడు

కుటుంబంతో వెళ్లి చూసేలా సినిమాలు ఉండాల‌ని తెలిపారు ఉప రాష్ట్ర‌ప‌తి వెంక‌య్య‌నాయుడు అన్నారు. నెల్లూరు జిల్లా వెంకటాచలంలోని స్వర్ణభారత్ ట్రస్ట్‌లో ఉప రాష్ట్రప‌తి వెంకయ్య నాయుడు ఉచిత మెగా వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయ‌న‌ మాట్లాడుతూ… ద‌ర్శ‌కులు, పాటలు, మాటల రచయితలు ఆ విధంగా జాగ్ర‌త్త‌లు తీసుకోవాల‌ని ఆయ‌న సూచించారు. సినిమాల్లో అశ్లీలత, హింస‌ పెరిగిపోతున్నాయ‌న్నారు. ప్రతి ప్రాంతంలో గ్రంథాలయం, దేవాలయం, వైద్యాలయం, సేవాలయం ఉండాలని ఆయ‌న అన్నారు. ప్ర‌తి పౌరుడు త‌మ గ్రామానికి ఏదో ఒక సహాయం చేయాలని ఆయ‌న చెప్పారు. తాము 21 సంవత్సరాల ముందు స్వర్ణ భారత్ ట్రస్ట్ ను సేవా దృక్పథంతో ఏర్పాటు చేశామ‌ని తెలిపారు. అభివృద్ధి పథంలో భార‌త్ ముందుకు వెళుతోందని చెప్పారు. అందరూ ఆరోగ్యకరంగా ఉండేందుకు వ్యాయామం చేయాలని తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement