Saturday, May 4, 2024

ఏక‌ధాటిగా 250కిలోమీట‌ర్లు స్కేటింగ్ – ఎనిమిదేళ్ల బాలిక రికార్డ్

250కిలోమీట‌ర్లు ఏక‌ధాటిగా స్కేటింగ్ పూర్తి చేసి రికార్డు సృష్టించి అంద‌రి మ‌న్న‌న‌లు పొందింది ఎనిమిదేళ్ల వెన్సిక శిరి అనే బాలిక‌. ఈ బాలిక‌ది చిత్తూరు జిల్లా పుత్తూరు. మురళి, సరిత దంపతుల కుమార్తె శిరి వజ్ర ..వరల్డ్‌ రికార్డు సంస్థ సీఈవో తిరుపతిరావు, పలమనేరు డీఎస్పీ గంగయ్య సమక్షంలో ఏపీ సరిహద్దు ప్రాంతం నంగిలి నుంచి ఉదయం 7 గంటలకు స్కేటింగ్‌ను ప్రారంభించింది. రాత్రి 10.30 నిమిషాల వరకు ఏకధాటిగా దాదాపు 250 కి. మీ నగరి వరకు స్కేటింగ్‌ చేసి ఔరా అనిపించుకుంది. బేటీ బచావో.. బేటీ పడావో, అమ్మాయి చదువు.. ఇంటికి వెలుగు, ఆడపిల్లలను అన్నింటా ఎదగనిద్దాం అనే లక్ష్యంతో స్కేటింగ్‌ కొనసాగించిన శిరిని నగరి ఎమ్మెల్యే రోజా ప్రత్యేకంగా అభినందించారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement