Friday, April 26, 2024

ఇండియాలో కొత్త‌గా 226 క‌రోనా కేసులు.. ముగ్గురు మృతి

ఇండియాలో కొత్త‌గా 226క‌రోనా కేసులు న‌మోద‌య్యాయి. ముగ్గురు క‌రోనాతో మృతి చెందారు. నిన్న ఉదయం 8గంటల నుంచి శనివారం ఉదయం 8గంటల వరకు 1,87,983 మందిని పరీక్షించగా 226 కేసులు బయటపడినట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 4,46,78,384కి చేరింది. ప్రస్తుతం దేశంలో 3,653 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. గత 24 గంటల్లో ముగ్గురు మృతి చెందగా.. మొత్తం మరణాల సంఖ్య 5,30,702కి చేరింది. ఇప్పటివరకు నమోదైన మొత్తం పాజిటివ్‌ కేసుల్లో 0.01 కేసులు మాత్రమే యాక్టివ్‌గా ఉన్నాయని వెల్లడించింది. రికవరీ రేటు 98.80 శాతంగా, మరణాలు 1.19 శాతంగా ఉన్నాయని పేర్కొంది. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 220.10 కోట్ల కరోనా వ్యాక్సిన్‌ డోసులను పంపిణీ చేశామని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement