Tuesday, May 7, 2024

ఇన్స్‌పెక్టర్ల బదిలీ..

పెద్దపల్లి : మల్టి జోన్‌ 1 పరిధిలో పని చేస్తున్న 10 మంది ఇన్స్‌పెక్టర్లను బదిలీ చేస్తూ అడిషనల్‌ డీజీ వై. నాగిరెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. భూపాలపల్లి ఎస్‌బీలో పని చేస్తున్న బోనాల రాజేశ్వర్‌రావును డీఎస్‌బీ-1 భూపాలపల్లికి, కరీంనగర్‌ అటాచ్డ్‌గా ఉన్న సంద లింగమూర్తిని కరీంనగర్‌ సీసీఎస్‌కు, అటాచ్డ్‌గా ఉన్న అచ్చ కిరణ్‌కుమార్‌ను చందుర్తికి, అటాచ్డ్‌గా ఉన్న మధుకర్‌ను రాజన్న సిరిసిల్ల జిల్లా పీసీఆర్‌కు, రామగుండం ఎస్‌బీలో పని చేస్తున్న బొల్లం రమేశ్‌ను హుజురాబాద్‌కు, హుజురాబాద్‌లో పని చేస్తున్న వి. శ్రీనివాస్‌ను రామగుండం ఎస్‌బీకి, వెయిటింగ్‌లో ఉన్న రమేశ్‌కుమార్‌ను సిద్దిపేట కమిషనరేట్‌కు, వరంగల్‌లో వెయిటింగ్‌లో ఉన్న జి. సతీష్‌కుమార్‌ను ఆదిలాబాద్‌ వీఆర్‌కు, వెయిటింగ్‌లో ఉన్న పొన్నం సత్యనారాయణను కొమురంభీం ఆసిఫాబాద్‌ ఎస్‌బీకి, డీఐజీ కార్యాలయంలో అటాచ్డ్‌గా ఉన్న శ్రీలతను నిజామాబాద్‌ కమిషనరేట్‌కు బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement