Monday, April 29, 2024

India corona: దేశంలో భారీగా తగ్గిన కరోనా.. కొత్తగా ఎన్ని కేసులంటే..

దేశంలో కరోనా కేసులు భారీగా తగ్గుముఖం పట్టాయి. కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించిన తాజా బులిటెన్ ప్రకారం.. గడిచిన 24 గంటల్లో కొత్తగా 22,270 కరోనా కేసులు వెలుగు చూశాయి. కోవిడ్ తో మరో 325 మంది మరణించారు. దీంతో ఇప్పటివరకు మొత్తం 5,11,230 మంది ప్రాణాలు కోల్పోయారు.

గడిచిన 24 గంటల్లో 60,298 మంది బాధితులు కోలుకున్నారు. దీంతో ఇప్పటివరకు కోలుకున్న వారి సంఖ్య 4,20,37,536కి చేరింది. ప్రస్తుతం దేశంలో 2,53,739 యాక్టివ్ కేసులు ఉన్నాయి. పాజిటివిటీ రేటు 1.08 శాతంగా ఉంది. కాగా, నిన్న 36,28,578 మందికి కోవిడ్ టీకాలు అందించారు. దీంతో ఇప్పటివరకు పంపిణీ అయిన మొత్తం డోసుల సంఖ్య 1,75,03,86,834కు చేరింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement