Friday, May 17, 2024

కన్నతల్లిపై కొడుకు కర్కశం.. ఆస్తి కోసం అమానుషం

కన్నతల్లి పట్ల ఓ కొడుకు అత్యంత కర్కశంగా ప్రవర్తించాడు. వృద్దురాలు అని కూడా చూడకుండా ఆమెపై దాడికి పాల్పడ్డాడు. నవమాసాలు మోసి, కనీ పెంచిన కన్నతల్లినే చెంబుతో కొట్టి.. కాలితో తన్నాడు. ఈ అమానుష ఘటన గుంటూరు జిల్లా తాడేపల్లిలో దారుణం వెలుగుచూసింది. తల్లిపై కొడుకు దాడికి పాల్పడిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

వివరాల్లోకి వెళితే… గుంటూరు జిల్లా తాడేపల్లి పరిధిలోని బ్రహ్మానందపురంలో నాగమణి అనే వృద్దురాలు నివసిస్తోంది. ఆమె భర్త వెంకటేశ్వరరావు కొన్నేళ్ల క్రితం చనిపోయాడు. ప్రస్తుతం తన ఇంట్లో కుమారుడు శేషు, భార్యతో కలిసి ఉంటున్నాడు. వృద్ధాప్యంలో కొడుకు తనకు తోడుగా ఉంటాడని తల్లి నాగమణి భావించింది. అయితే, శేషు మాత్రం ఆస్తి కోసం కన్నతల్లిని వేధించడం మొదలుపెట్టాడు. ఈ క్రమంలో ఆమెను చిత్రహింసలకు గురిచేసేవాడు. శుక్రవారం తల్లితో మరోసారి గొడవపడ్డ శేషు.. చెంబుతో ఆమె తలపై దాడి చేశాడు. ఆమెను కాలితో తన్నాడు. నిలబడలేని స్థితిలో ఉన్న ఆ వృద్దురాలిపై అత్యంత కర్కశంగా ప్రవర్తించాడు. శేషు దాడిని స్థానికులు సెల్‌ఫోన్‌లో చిత్రీకరించారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement