Thursday, May 2, 2024

ఇండియాలో కొత్తగా 2,119కరోనా కేసులు

కరోనా వైరస్‌ కేసులు రోజురోజుకు తగ్గుముఖం పట్టాయి. గత కొన్ని రోజులుగా కొత్త కేసులు రెండు వేలకు సమీపంలోనే వెలుగుచూస్తున్నాయి. తాజాగా… ఇండియాలో 2,119 కొత్త కేసులు నమోదైనట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 44,638,636 చేరింది. నిన్న ఒక్కరోజే 2,582 మంది కరోనా వైరస్‌ నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం దేశంలో 25,037 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. గత 24 గంటల్లో కరోనా కారణంగా 10 మంది మృతి చెందగా.. మొత్తం మరణాల సంఖ్య 528,953 కి చేరినట్లు వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement