Thursday, May 9, 2024

Fire Accident: ఘజియాబాద్ అగ్నిప్రమాదంలో 35 ఆవులు మృతి

ఉత్తరప్రదేశ్ లోని ఘజియాబాద్‌లో జరిగిన అగ్రిప్రమాదంలో 30కిపైగా ఆవులు మరణించాయి. ఈ ఘటన కనవాని గ్రామంలో సోమవారం చోటు చేసుకుంది. కనవాని గ్రామంలోని మురికివాడలో సోమవారం మధ్యాహ్నం భారీ మంటలు చెలరేగాయి, కొద్దిసేపటికే దాదాపు 70 ఆవులు ఉన్న సమీపంలోని గోశాలలో మంటలు వ్యాపించాయి. అగ్ని ప్రమాదంలో సుమారు 30 నుండి 40 ఆవులు కాలిపోయాయి. ఎటువంటి మానవ ప్రాణనష్టం జరగనప్పటికీ, అగ్నిప్రమాదానికి ఖచ్చితమైన కారణం ఇంకా తెలియరాలేదు.

Advertisement

తాజా వార్తలు

Advertisement