Saturday, May 4, 2024

Breaking | బండికి 14 రోజుల రిమాండ్​.. కస్టడీ కోరిన పోలీసులు

పదో తరగతి పరీక్షా ప్రశ్న పత్రాల మాల్​ ప్రాక్టీస్​ కేసులో ఏ1 నిందితుడిగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ పై కేసు నమోదైంది. ఈ కేసులో హన్మకొండ సేషన్స్​ కోర్టు ఇవ్వాల (బుధవారం) రిమాండ్​ విధించింది. కాగా, వరంగల్​ పోలీసులు ప్రశ్నాపత్రాల కేసులో కాన్​స్పిరసీ (కుట్ర) ఉందని, అతని నుంచి  మరిన్ని ఆధారాలు సేకరించాలని కోర్టుకు తెలిపారు. తమ విచారణకు అనుమతి ఇవ్వాలని కోరుతూ పిటిషన్​ దాఖలు చేశారు. దీనికి స్పందించిన న్యాయమూర్తి పోలీసుల కస్టడీకి అనుమతిచ్చారు.

ఇక.. బండికి బెయిల్​ కోసం బీజేపీ లీగల్​  సెల్​ తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. హన్మకొండ అదాలత్​ దగ్గర పెద్ద ఎత్తున అడ్వొకేట్స్​ గుమిగూడి చర్చించుకుంటున్నారు. బండి సంజయ్​ రిమాండ్​ నేపథ్యంలో ఉద్రిక్తత నెలకొనకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. గుమిగూడిని బీజేపీ, బీఆర్​ఎస్​ కార్యకర్తలను అక్కడి నుంచి దూరంగా పంపించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement