Saturday, April 27, 2024

Breaking: ఆలయంలోని మెట్లబావిలో పడి.. 13 మంది దుర్మరణం

శ్రీరామ నవమి రోజున విషాదం చోటు చేసుకుంది. ఇండోర్ లోని బేలేశ్వర్ మహాదేవ్ ఆలయంలో జరిగిన ప్రమాదంలో 13మంది భక్తులు మరణించారు. శ్రీరామ నవమి కావడంతో ఎక్కువ సంఖ్యలో భక్తులు ఆలయానికి వచ్చారు. దీంతో మెట్లబావిపై ఉన్న ఫ్లోర్ కూలిపోవడంతో ఒక్కసారిగా భక్తులు అందులో పడిపోయారు. మొత్తం 30 మంది బావిలో పడిపోయారు. ఇప్పటి వరకు 13మంది మరణించగా.. మరికొంత మందిని అధికారులు రక్షించారు. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు. మరణించిన వారిలో మహిళలు, పురుష భక్తులు ఉన్నారు.

తాళ్లు, నిచ్చెనల సహాయంతో బాధితులను బయటకు తీసుకువచ్చారు. మిగిలిన వారిని కూడా సుక్షితంగా తీసుకువచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తెలిపారు. ఈ ఘటనపై ప్రధాని నరేంద్రమోదీ ఆందోళన వ్యక్తం చేశారు. ఇండోర్ లో జరిగిన దుర్ఘటన చాలా బాధ కలిగిందని, సీఎం శివరాజ్ సింగ్ తో మాట్లాడి పరిస్థితిని తెలుసుకున్నానని, రాష్ట్ర ప్రభుత్వం త్వరితగతిన రెస్క్యూ, రిలీఫ్ కార్యక్రమాలను వేగవంతం చేస్తుందని, బాధిత కుటుంబాలకు సానుభూతి వ్యక్తం చేస్తూ ట్వీట్ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement