Thursday, April 18, 2024

సీఎం జగన్ మంకుపట్టు వీడాలి : సీపీఐ నేత రామకృష్ణ

అమరావతి : అమరావతి రాజధాని ఉద్యమం 1200 రోజులకు చేరుకుని, చరిత్రలో కనివినీ ఎరుగని ఉద్యమమైందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ అన్నారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ.. అమరావతినే రాజధానిగా అభివృద్ధి పరచాలని హైకోర్టు చెప్పినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం లెక్కచేయకుండా సుప్రీం కోర్టుకెక్కిందని మండిపడ్డారు. సుప్రీంకోర్టులో కూడా జగన్ సర్కారుకు అనుకూలంగా స్టే ఇవ్వలేదన్నారు. అమరావతి రాజధాని అంశం పై ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇప్ప‌టికైనా మంకుపట్టు వీడాలన్నారు. తాడేపల్లిలో ఇల్లు కట్టుకున్న ఏకైక నేతగా జగన్మోహన్ రెడ్డి గత ఎన్నికల్లో ప్రజల్ని మభ్యపెట్టారని విమర్శించారు. అధికారంలోకి రాగానే మాట మార్చి, మడం తిప్పి, మూడు రాజధానుల పేరుతో ప్రాంతాల మధ్య చిచ్చు పెడుతున్నారన్నారు. ఉగాది తదుపరి విశాఖ నుంచి పాలన సాగిస్తామన్న జగన్‌కు ఇటీవల జరిగిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో విశాఖలో చుక్కెదురయిందని అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement