Monday, May 6, 2024

విశాఖ స్టీల్‌ప్లాంట్‌పై పునరాలోచించాలని ప్రధానికి లేఖ

విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణపై కార్మికులు నిరసనలకు దిగిన నేపథ్యంలో ప్రధాని మోదీకి ఏపీ సీఎం జగన్ మరోసారి లేఖ రాశారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై కేంద్రం పునరాలోచించుకోవాలని లేఖలో ఆయన కోరారు. ఈ సమస్యపై స్వయంగా వివరించేందుకు ప్రధాని అపాయింట్‌మెంట్ కోరారు. అలాగే తనతో పాటు అఖిలపక్ష నాయకులు, కార్మిక సంఘాల నేతలను ఢిల్లీకి తీసుకువస్తానని జగన్ లేఖలో పేర్కొన్నారు. కాగా ఇప్పటికే ఓ సారి విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా లేఖ రాయడమే కాకుండా ప్రత్యామ్నాయాలను కూడా ఆయన సూచించారు. తాజాగా ఆర్దిక మంత్రిక నిర్మలా సీతారామన్ ప్రకటన తర్వాత విశాఖలో నిరసనలు ఉదృతమయ్యాయి. విశాఖ ఉక్కు ప్రజల సెంటిమెంట్ అని కూడా జగన్ ప్రధానికి రాసిన లేఖలో వివరించారు. మరోవైపు విశాఖలో స్లీల్ ప్లాంట్ ఉన్నతాధికారులను కార్మికులు నిర్భందించారని వార్తలు వస్తున్నాయి. దీంతో స్టీల్ ప్లాంట్ పరిసరాల్లో పోలీసులు భారీగా మోహరించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement