Saturday, May 11, 2024

విజయవాడలో తెలుగు తమ్ముళ్ల మధ్య చిచ్చు

విజయవాడ టీడీపీలో విభేదాలు బయటపడ్డాయి. తమ పార్టీ ఎంపీ కేశినేని నాని తీరుపై టీడీపీ నేత‌ బోండా ఉమ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. విజ‌య‌వాడ‌లో మీడియాతో మాట్లాడుతూ.. విజయవాడ టీడీపీకి తానే అధిష్ఠానమని కేశినేని వ్యాఖ్య‌లు చేసి త‌న తీరును బ‌య‌ట‌పెట్టార‌ని దుయ్యబట్టారు. పార్టీ నేతల మధ్య కేశినేని నాని విభేదాలు సృష్టిస్తున్నారని, విజ‌య‌వాడ‌లో ఆయనకు అంత‌ స‌త్తా ఉంటే రాజీనామా చేసి స్వ‌తంత్ర అభ్య‌ర్థిగా గెలిచి చూపించాల‌ని సవాల్ విసిరారు. ఆయ‌న అలా గెలిస్తే తాను విజ‌య‌వాడను వ‌దిలేసి కట్టుబట్టలతో వెళ్లిపోతాన‌ని వ్యాఖ్యానించారు.
తన కూతురుని మేయర్ చేయడం కోసమే కేశినేని నాని ప్రయత్నిస్తున్నారని ధ్వజమెత్తారు. త‌మ పార్టీ అధినేత చంద్ర‌బాబుకు కేశినేని కావాలో.. తామంద‌రం కావాలో తేల్చుకోవాలని బోండా ఉమ అల్టిమేటం జారీ చేశారు. చంద్ర‌బాబుకు కేశినేని నాని ముఖ్యం అనుకుంటే, తాము రేపు జరుగబోయే చంద్రబాబు ప‌ర్య‌ట‌న‌కు దూరంగా ఉంటామని ఆయ‌న పేర్కొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement