Tuesday, April 30, 2024

మాజీ ఎంపీ సబ్బం హరి పరిస్థితి విషమం

కరోనా బారిన పడిన మాజీ ఎంపీ, టీడీపీ నేత సబ్బం హరి ఆరోగ్య పరిస్థితి విషమించింది. ప్రస్తుతం విశాఖపట్నంలోని ఓ ప్రైవేట్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆదివారం ఆరోగ్య పరిస్థితి కాస్త విషమించిందని ఆసుపత్రి వైద్యులు తెలిపారు. పది రోజుల క్రితం ఆయ‌న‌కు కోవిడ్ సోకడంతో వైద్యుల సూచ‌న‌తో హోం ఐసోలేష‌న్‌ లోనే ఉంటూ వైద్యం తీసుకున్నారు. అయితే మూడు రోజుల క్రితం ఆక్సిజన్ స్థాయి పడిపోవడంతో ఆయన ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతున్నారు. గత మూడు రోజులుగా వెంటిలేటర్‌పై ఆయనకు చికిత్స అందిస్తున్నట్లు వైద్య వర్గాలు పేర్కొన్నాయి. సబ్బం హరి ఆరోగ్యం విషమించిందని తెలియడంతో ఆయన అనుచరులు, అభిమానులు ఆందోళన చెందుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement