Thursday, May 2, 2024

త్వరలోనే టీడీపీలో చేరనున్న వైసీపీ నేత

ప్రకాశం: వైసీపీ నేత, ఎర్రగొండపాలెం మాజీ ఎమ్మెల్యే పాలపర్తి డేవిడ్ రాజు త్వరలో టీడీపీలో చేరనున్నారు. వైసీపీ ప్రభుత్వ విధానాలు నచ్చకపోవడం వల్లే తాను టీడీపీలో చేరుతున్నట్లు డేవిడ్ రాజు వెల్లడించారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక దళితులపై దాడులు పెరిగాయన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలలో వైసీపీ దౌర్జన్యాలకు పాల్పడిందని ఆయన ధ్వజమెత్తారు. టీడీపీ అభ్యర్థులను బెదిరించి వైసీపీ ఏకగ్రీవం చేసుకుంటుందని, మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ఏ ముఖం పెట్టుకుని ఒంగోలు ప్రజలను ఓట్లు అడుగుతారని సూటిగా ప్రశ్నించారు. మున్సిపల్ ఎన్నికల్లో ఒంగోలు అభివృద్ధి చెందాలంటే ప్రజలు టీడీపీకి ఓటు వేయాలని కోరారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement