Wednesday, April 24, 2024

మరోసారి బాబాయ్‌తో అబ్బాయ్

విక్టరీ వెంకటేష్, రానా నిజ జీవితంలో బాబాయ్-అబ్బాయ్ అన్న విషయం తెలిసిందే. గతంలో క్రిష్ దర్శకత్వంలో వచ్చిన ‘కృష్ణం వందే జగద్గురుం’సినిమాలో బళ్లారి బావ పాటలో కలిసి తెరపై కనిపించిన వీరు.. మరోసారి వెండితెరపై కలిసి నటించి అభిమానులకు విందు చేయనున్నారు. వీరు ‘దృశ్యం-2’ సినిమాలో కలిసి నటించబోతున్నారు. ఈ సినిమా మలయాళ వెర్షన్‌లో మురళీగోపీ చేసిన కొత్త ఇన్‌స్పెక్టర్ పాత్రలో రానా కనిపించనున్నాడు. ‘దృశ్యం’ సినిమాలో క్లోజ్ అయిపోయిన కేసును సీక్వెల్‌లో కొత్త ఇన్‌స్పెక్టర్‌గా ఛార్జ్ తీసుకునే రానా ఈ కేసును మళ్లీ రీఓపెన్ చేయనున్నాడు. మలయాళంలో సీక్వెల్‌కు దర్శకత్వం వహించిన జీతూ జోసెఫ్ తెలుగు వెర్షన్‌నూ తెరకెక్కిస్తున్నాడు. కాగా ఇటీవలే తెలుగులో ఈ సినిమా షూటింగ్ ప్రారంభమైంది. రెండు నెలల్లో ఈ మూవీ చిత్రీకరణను నిర్మాతలు పూర్తి చేసి ఈ ఏడాదిలో విడుదల చేస్తారని తెలుస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement