Monday, May 6, 2024

కేసీఆర్‌పైనే విమర్శలు చేసిన పరకాల ఎమ్మెల్యే

ప‌ర‌కాల నియోజ‌క‌వ‌ర్గ టీఆర్ఎస్ ఎమ్మెల్యే చ‌ల్లా ధ‌ర్మారెడ్డి మ‌ళ్లీ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆయన తన ఉద్దేశాన్నే బ‌య‌ట‌పెట్టేశారా? లేదా పొరపాటున అన్నారా? అనేది ప్రస్తుతం ఉమ్మడి వరంగల్ జిల్లాలో రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. విషయం ఏంటంటే.. గురువారం ప‌ర‌కాల నియోజ‌క‌వ‌ర్గం కంఠాత్మకూరులో ప‌ర్యటించిన ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడారు. నూత‌న‌ వ్యవ‌సాయ చ‌ట్టాలను ర‌ద్దు చేయాల‌ని డిమాండ్ చేస్తూ.. ఢిల్లీ కేంద్రంగా 140 రోజుల నుంచి రైతులు ఉద్యమం చేస్తున్నా.. ప్రధాని మోదీ, కేసీఆర్‌లు ప‌ట్టించుకోని పుణ్యాత్ములంటూ వ్యాఖ్యనించారు. చల్లా ధర్మారెడ్డి వ్యాఖ్యలు ఇప్పుడు సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారాయి.

YouTube video
Advertisement

తాజా వార్తలు

Advertisement