Wednesday, April 24, 2024

నాన్నపై ప్రేమతో…. నడిరోడ్డులో నరికేసిన కొడుకులు !!

పట్టపగలే నడిరోడ్డుపై అత్యంత దారుణంగా హైదరాబాద్ రాజేంద్ర నగర్ లో ఓ వ్యక్తిని నరికి చంపిన సంగతి తెలిసిందే. అయితే తన తండ్రిని చంపిన వ్యక్తిపై పగ పెంచుకున్న కుమారులే ఈ హత్య చేశారని పోలీసులు నిర్ధారణకు వచ్చారు. ఆ పగ తోనే నడిరోడ్డు పై వేట కొడవళ్ళతో నరికి చంపారు. పూర్తి వివరాల్లోకి వెళితే అసద్ ఖాన్, అంజాద్ ఖాన్ ఇద్దరు స్నేహితులు. అయితే వారి స్నేహాన్ని మరింత బలపరిచుకోవడానికి అసద్ ఖాన్ తన కుమార్తెను స్నేహితుడి కుమారుడికి ఇచ్చి నాలుగేళ్ల క్రితం వివాహం జరిపించాడు. కానీ వారిద్దరి మధ్య మనస్పర్థలు రావడంతో అమ్మాయి పుట్టింటికి వచ్చేసింది. అమ్మాయి అబ్బాయి మధ్య గొడవకి కారణం తన స్నేహితుడు అని భావించిన అసద్ పగ పెంచుకున్నాడు.

2018 శాస్త్రిపురంలోని వెల్డింగ్ షాప్ లో ఒంటరిగా ఉన్న అంజాద్ ను ఐదుగురు తో కలిసి దాడి చేశాడు. అక్కడే చంపేశాడు. అయితే ఈ ఘటనలో అసద్ అరెస్టయి జైలుకు వెళ్ళాడు. జైలు నుండి బయటకు వచ్చిన తర్వాత పోలీసులు రౌడీషీట్ ఓపెన్ చేశారు. అయితే అప్పటి నుంచి కూడా అంజాద్ ఖాన్ కుమారులు అదును కోసం ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలోనే గురువారం మధ్యాహ్నం ద్విచక్ర వాహనంలో మైలార్దేవ్పల్లి పరిధిలోని నైస్ హోటల్ మీదుగా వెళ్తున్న సమయంలో ఆటో వచ్చి ఢీకొట్టింది. తర్వాత ఆటోలో నుంచి దిగిన ఆరుగురు వేటకొడవళ్లతో కిందకు దిగి దాడి చేశారు. దాడిలో అసద్ అతను చనిపోయాడు. వెంటనే వేటకొడవళ్లను వదిలి అక్కడి వారంతా పరారయ్యారు. మృతదేహంపై 50కిపైగా కత్తిపోట్లు ఉన్నాయని శంషాబాద్ డీసీపీ ప్రకాష్ రెడ్డి తెలిపారు. ఈ దారుణానికి పాల్పడినడి అంజాద్ ఖాన్ కుమారులేనని పోలీసులు ప్రాథమిక నిర్థారణకు వచ్చారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement