Sunday, April 28, 2024

ఏది రియల్? ఏది వైరల్?

ఏపీలో మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా కేంద్ర మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ అశోక్ గజపతిరాజు మహిళపై చేయి చేసుకున్నారంటూ వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. అధికార పార్టీ నాయకులు సైతం ఈ విషయాన్ని ఎత్తిచూపుతూ విమర్శలు చేస్తున్నారు. కాగా ఈ విషయంపై అశోక్ గజపతిరాజు ఎవరినైతే కొట్టారని చూపిస్తున్నారో ఆ మహిళ స్పందించింది. తనపై ఎవరు చేయి చేసుకోలేదని.. హారతి ఇచ్చే సమయంలో తన చీరపై నిప్పురవ్వలు పడటంతో వెంటనే ఆయన కొబ్బరికాయ ఉంచిన పళ్లెంను నేలకు కొట్టి తనను ప్రమాదం నుంచి కాపాడారని ఆమె తెలిపింది. కానీ వైసిపి నేతలు దీనిపై కూడా తప్పుడు ప్రచారాలు చేస్తూ రాజకీయం చేస్తున్నారని ఆమె ఆరోపించింది. వైసీపీ నేతలు ఆ వీడియోను తప్పుగా ప్రచారం చేస్తూ వైరల్ చేస్తున్నారని ఆమె మండిపడింది. అశోక్ గజపతి తనకు తండ్రి లాంటి వారని ఆమె చెప్పుకొచ్చింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement