Friday, May 3, 2024

వైసిపికి ఓటేస్తే రౌడీ రాజ్య‌మే – చంద్ర‌బాబు నాయ‌డు..

గుంటూరు – వైసిపికి ఓటేస్తే ఇక పూర్తిగా రౌడీ రాజ్య‌మే అవుతుంద‌ని గుంటూరు ఓట‌ర్ల‌ను టిడిపి అధినేత చంద్ర‌బాబు నాయుడు హెచ్చ‌రించారు.. గుంటూరులో ఆయ‌న రోడ్ షో ల‌తో ఎన్నికల ప్ర‌చారం నిర్వ‌హించారు.. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ, బెదిరింపులతో రౌడీరాజ్యం తెస్తామనడం తగద‌న్నారు. వైకాపాకు ఓటు వేయకపోతే సంక్షేమ పథకాల్లో కోత విధిస్తామని బెదిరింపులకు దిగడం దారుణమని తెలుగుదేశం అధినేత చంద్రబాబు విమర్శించారు. అభివృద్ధి పనులు చేసి ఓట్లు అభ్యర్థించాలని కానీ.. బెదిరింపులతో రౌడీరాజ్యం తెస్తామనడం తగదన్నారు. ఒక్క అవకాశం అంటూ గద్దెనెక్కిన జగన్‌.. నిత్యవసరాల ధరలను విపరీతంగా పెంచారని చంద్రబాబు మండిపడ్డారు. రాష్ట్రంలో సామాన్యుడు జీవించే పరిస్థితులు లేవని.. ఇసుక, లిక్కర్ మాఫియా చెలరేగిపోతోందని చంద్రబాబు మండిపడ్డారు. రాజధాని కోసం పోరాడుతున్న అమరావతి మహిళలపై దాడి దారుణమని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. ఓట‌ర్లు విజ్ఞ‌త‌తో ఆలోచించి ఓటు వేయాల‌ని అభ్య‌ర్ధించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement