Thursday, May 9, 2024

Wasim Akram Fire – రోజూ 8 కిలోల మాంసం తింటే ఇలాగే ఓడిపోతారు….

ఆప్ఘనిస్థాన్ లాంటి పసికూన చేతిలో.. అదీ 8 వికెట్ల తేడాతో ఓడిపోవడం పాక్‌కు ఘోర పరాభవమనే చెప్పాలి. బౌలింగ్, ఫీల్డింగ్, బ్యాటింగ్.. అన్ని విభాగాల్లో పాక్ క్రీడాకారులు నిరాశపరిచారు. పాక్ క్రీడాకారుల్లో కనీస ఫిట్‌నెస్‌ స్థాయులు కూడా లేకపోవడం అభిమానులను తీవ్ర అసంతృప్తికి గురిచేస్తోంది. ఈ క్రమంలో పాక్ మాజీ క్రీడాకారుడు వసీం అక్రం చేసిన సంచలన వ్యాఖ్యలు ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారాయి. రోజూ తిండిమీద ధ్యాస పెడితే ఓట‌మిలు త‌ప్ప‌వ‌న్నాడు.. ఆట కంటే పాక్ జ‌ట్టుకు తిండిమీద ఎక్కువ ధ్యాస పెట్టారంటూ మండిప‌డ్డాడు.. వీళ్లు రోజుకు 8 కేజీల చొప్పున మటన్ తిన‌డం వ‌ల్లే గ్రౌండ్ లో క‌ద‌ల‌లేక చిత్తుగా ఓడారంటూ అక్రం చిర్రుబుర్రులాడాడు.. ప్రస్తుతం ఏ స్థితికి చేరుకున్నామంటే విజయం కోసం దేవుణ్ణి ప్రార్థించాల్సి వస్తోంది అంటూ వాపోయాడు..

Advertisement

తాజా వార్తలు

Advertisement