Friday, May 3, 2024

Third Test: రాజ్‌కోట్‌ వేదికగా మూడో టెస్ట్… గెలుపే లక్ష్యంగా బరిలో రెండు టీంలు

ఇంగ్లాండ్​తో జరుగుతోన్నటెస్టు సిరీస్‌లో కీలక సమరానికి వేళైంది. నేటి నుంచి భారత్‌, ఇంగ్లండ్ జట్ల మూడో టెస్టు ఆరంభం కానుంది. రాజ్‌కోట్‌ వేదికగా ఈ టెస్ట్ జరగనుంది. సొంతగడ్డపై తురుగులేని టీమిండియాకు ఇంగ్లండ్ నుంచి గట్టి పోటీ ఎదురవుతోంది.

అనూహ్యంగా తొలి టెస్టులో ఓడిన భారత్‌.. విశాఖ టెస్టులో గెలిచి సిరీస్‌ను సమం చేసింది. పిచ్‌లు మరీ ఎక్కువగా స్పిన్‌కు సహకరించని నేపథ్యంలో రెండు జట్ల పోరు మరింత ఆసక్తికరంగా మారింది. ఈ పరిస్థితుల్లో రాజ్‌కోట్‌ ఏ జట్టు ఆధిపత్యం కనబర్చుతుందో చూడాలి. మ్యాచ్ ఈరోజు ఉదయం 9.30కు ఆరంభం అవుతుంది. స్పోర్ట్స్‌ 18, జియో సినిమాలో మ్యాచ్ ప్రత్యక్షప్రసారం అవుతుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement