Sunday, April 28, 2024

Breaking | ఆసియాకప్​లో పోరాడిన బంగ్లా టీమ్​.. టీమిండియా టార్గెట్​ ఎంతంటే?

ఆసియాకప్​లో భాగంగా ఇవ్వాల (శుక్రవారం) భారత్​, బంగ్లా జట్ల మధ్య వన్డే మ్యాచ్​ జరుగుతోంది. టాస్ గెలిచిన టీమిండియా బౌలింగ్​ ఎంచుకుంది. తొలుత బ్యాటింగ్​కు దిగిన బంగ్లా జట్టు నిర్ణీత ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 265 పరుగులు చేసింది. ఈ క్రమంలో ఓపెనర్​ హసన్​ (13) పరుగులు చేయగా.. లిటన్​ దాస్​ (0) డకౌట్​గా వెనుదిరిగాడు. ఇక.. షకీబుల్​ హసన్​ (80) పరుగులతో ఆకట్టుకున్నాడు. హృదయ్​ (54), నాసుమ్​ అహ్మద్​ (44) పరుగులతో రాణించారు. కాగా, మిగతా వారంతా సోసోగా ఆడారు.

కాగా, ​టీమిండియా బౌలర్లలో శార్దూల్​ ఠాకూర్​ 3 వికెట్లు, మహ్మద్​ షమీ 2 వికెట్లు పడగొట్టారు. ప్రసిద్​ కృష్ణా, అక్షర్​ పటేల్​, రవీంద్ర జడేజా తలా ఒక వికెట్ పడగొట్టారు. ఇక.. ఇండియా 266 పరుగుల లక్ష్యంతో చేజింగ్​కు దిగనుంది.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement