Tuesday, April 30, 2024

Test Match – ద‌క్షిణాఫ్రికా నుంచి తిరిగొచ్చిన కోహ్లీ…టెస్ట్ స్క్వాడ్ నుంచి రుతురాజ్ ఔట్

ప్రస్తుతం భారత క్రికెట్ జట్టు దక్షిణాఫ్రికాలో పర్యటిస్తుండగా, టెస్టు సిరీస్ ముంగిట ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. స్టార్ బ్యాట్స్ మన్ విరాట్ కోహ్లీ దక్షిణాఫ్రికా నుంచి భారత్ తిరిగొచ్చాడు. కోహ్లీ కుటుంబపరమైన ఎమర్జెన్సీ కారణంగా స్వదేశానికి వచ్చాడని, దక్షిణాఫ్రికాతో డిసెంబరు 26 నుంచి జరిగే తొలి టెస్టు నాటికి జట్టుతో కలుస్తాడని బీసీసీఐ వర్గాలు తెలిపాయి. అయితే, కోహ్లీ ఏ కారణాలతో భారత్ వచ్చాడన్నది బోర్డు వెల్లడించలేదు .

ఇక రెండో వ‌న్డేలో గాయ‌ప‌డిన రుతురాజ్ గ్తైక్వాడ్ సైతం టెస్ట్ స్క్వాడ్ నుంచి వైతొలిగాడు.. గాయ‌ప‌డిన అత‌డు కూడా స్వ‌దేశానికి తిరిగి వచ్చాడు.. ఇంత‌కు ముందు పాస్ట్ బౌల‌ర్ ష‌మీ కూడా మోకాలి గాయంతో టెస్ట్ జ‌ట్టు నుంచి త‌ప్పుకున్నాడు..

Advertisement

తాజా వార్తలు

Advertisement