Sunday, April 28, 2024

T20 World Cup : ఓపెన‌ర్లుగా రోహిత్, కోహ్లీలు… టీ20 ప్ర‌పంచ‌క‌ప్ ప్లాన్

వెస్టిండీస్‌, అమెరికా వేదికగా జూన్‌ 1 నుంచి ఐసీసీ టీ20 ప్రపంకప్‌ ప్రారంభం కానుంది. ఈ మెగా సమరం కోసం ఈ నెలఖారులోగా ఆయా దేశాలు తమ జట్లను ప్రకటించాల్సి ఉంది. కాగా ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్‌ ఆధారంగా టీమిండియా ప్లేయర్ల ఎంపిక ఉంటుందని తెలుస్తోంది. అయితే ఈసారి ఓపెనర్‌ రోహిత్‌ శర్మతో రన్‌మెషీన్‌ విరాట్‌ కోహ్లీ జత కట్టనున్నాడని సమాచారం.

- Advertisement -

ఇందుకు సంబంధించి కెప్టెన్‌ రోహిత్‌ శర్మతో చీఫ్‌ సెలక్టర్‌ అజిత్‌ అగార్కర్‌, ప్రధాన కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌ చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం విరాట్‌ ఐపీఎల్‌లో ఓపెనర్‌గా అద్భుతంగా రాణిస్తున్నాడు. రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తున్న కోహ్లీ ఈ సీజన్‌లో ఇప్పటివరకు ఏడు మ్యాచుల్లో 361 పరుగులు చేసి టోర్నీ టాప్‌ స్కోరర్‌గా కొనసాగుతున్నాడు. ఆరెంజ్‌ క్యాప్‌ను కూడా సొంతం చేసుకున్నాడు. అందుకే ఈసారి రోహిత్‌కు జోడీగా యువ ఆటగాళ్లకి బదులుగా కోహ్లీని ఆడించాలని బీసీసీఐ సెలక్టర్లు భావిస్తున్నారని సమాచారం.

ఈ క్రమంలోనే ప్రపంచకప్‌ కోసం భారత సెలక్టర్లు ఇప్పటికే 20 మందిని ఎంపిక చేశారని ఓ ప్రముఖ వార్త సంస్థ పేర్కొంది. వారిలో 15 మంది రెగ్యులర్‌ సభ్యులు ఉండగా.. మిగతా ఐదుగురు స్టాండ్‌ బైలుగా ఉన్నారని ఆ సంస్థ తెలిపింది. కానీ ప్రపంచకప్‌ జట్టుపై బీసీసీఐ నుంచి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.

Advertisement

తాజా వార్తలు

Advertisement