Sunday, April 28, 2024

TS: మల్కాజిగిరి ఎంపీ అభ్యర్థిగా ఈటల రాజేందర్‌ నామినేషన్..

ప్రభ న్యూస్ ప్రతినిధి, మేడ్చల్ ఏప్రిల్ 18: కాంగ్రెస్, బీఆర్ఎస్ లకు డిపాజిట్ దక్కకుండా చేయాలని మల్కాజిగిరి పార్లమెంట్ నియోజక వర్గం బీజేపీ అభ్యర్థి ఈటెల రాజేందర్ ఓటర్లను కోరారు. గురువారం ఆయన దశమిని పురస్కరించుకుని మేడ్చల్ జిల్లా కలెక్టరేట్ లో రిటర్నింగ్ అధికారికి నామినేషన్ దాఖలు చేశారు.

అనంతరం ఈటెల మీడియాతో మాట్లాడుతూ… కాంగ్రెస్ సీఎం రేవంత్ రెడ్డి కూడా కేసీఆర్ బాటలోనే పయనిస్తున్నారన్నారని విమర్శించారు. ప్రజల నుంచి మోడీకి మంచి స్పందన వస్తున్నదని, అనేక వర్గాల ప్రజలు, సంఘాలు మరొక సారి మోడీని గెలిపించేందుకు మద్దతు ప్రకటిస్తున్నారన్నారు. ముఖ్యంగా ముస్లిం మహిళలు కూడా మోడీకి పెద్ద ఎత్తున మద్దతు ప్రకటిస్తున్నారన్నారు. మోడీ వచ్చిన తర్వాతే దేశానికి ప్రపంచ వ్యాప్తంగా కీర్తి ప్రతిష్టలు పెరిగాయన్నారు.

ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి, రాష్ట్ర నాయకులు వీరేందర్ గౌడ్, మహిళా మొర్చా రాష్ట్ర అధ్యక్షులు శిల్పా రెడ్డి, జిల్లా పార్టీ అధ్యక్షులు విక్రమ్ రెడ్డి, సామ రంగారెడ్డి, కార్పొరేటర్ రాజ్యలక్ష్మి, భాషా, ఎం.పి.పి.సుదర్శన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement