Thursday, May 2, 2024

Breaking: వైడ్​ బాల్స్​ని వదలకుండా ఉతికేసిన సూర్యా.. 18 బంతుల్లోనే 54 పరుగులు

సౌతాఫ్రికాతో జరుగుతు రెండో టీ20లో టీమిండియా పించ్​హిట్టర్​ సూర్యకుమార్​ దబిడ దిబిడ అనిపిస్తున్నాడు. ఫోర్లు, సిక్సులతో రెచ్చిపోయి ఆడడంతో 18 బంతుల్లోనే 54 పరుగులు చేశాడు.. ఇంతకుముందు కెప్టెన్​ రోహిత్​ (43), వైస్​ కెప్టెన్​ కేఎల్​ రాహుల్​ (57) పరుగులు చేసి అవుటయ్యారు. ఆ తర్వాత కోహ్లీ, సూర్యకుమార్​ జతకలిసి సఫారీలను చావబాదుతున్నారు. స్పీడ్​ బౌలింగ్​ అయినా.. స్పిన్నర్​ అయినా వదిలిపెట్టకుండా దంచడంతో సౌతాఫ్రికా కెప్టెన్​ బవుమా ఏం చేయాలో దిక్కుతోచక తలపట్టుకున్నంత పని అయ్యింది. ప్రస్తుతం 17వ ఓవర్​లో సూర్యకుమార్​ యాదవ్​ 55, కోహ్లీ 33 పరుగులతో ఆట కొనసాగిస్తుండగా.. టీమిండియా స్కోరు 194 పరుగులుగా ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement