Monday, April 29, 2024

Sports | 2వ రౌండ్‌లో కశ్యప్‌ నిష్క్రమణ

కెనడా ఓపెన్‌ 2023 బిడబ్ల్యుఎఫ్‌ సూపర్‌ 500 టోర్నమెంట్‌లో భారత స్టార్‌ షట్లర్‌ పారుపల్లి కశ్యప్‌ పోరాటం ముగిసింది. బుధవారం కాల్గరీలో జరిగిన రౌండవ రౌండ్‌లో చైనాకు చెందిన లీ లాన్‌ జి చేతిలో ఓటమి చవిచూశాడు. లీ వరుస సెట్లలో 21-17, 22-10 స్కోరుతో కశ్యప్‌ను ఓడించాడు. బిడబ్ల్యుఎఫ్‌ సింగిల్స్‌ ర్యాంకుల్లో ఒకప్పుడు 6వ స్థానంలో ఉన్న ఇతడు, ఇప్పుడు 189వ ర్యాంక్‌లో కొనసాగుతున్నాడు. కశ్యప్‌ తన మొదటి రౌండ్‌ మ్యాచ్‌లో జర్మనీకి చెందిన కైస్కాఫెర్‌పై గెలిచాడు. మరోవైపు భారత్‌కు చెందిన ఏకైక పురుషుల డబుల్స్‌ జోడీ కృష్ణప్రసాద్‌, విష్ణువర్ధన్‌ గౌడ్‌ తమ మొదటి రౌండ్‌లో చైనీస్‌ తైపీకి చెందిన లుచెన్‌, చెంజిరే పై వరుస గేమ్‌లలో 21-14, 21-16 స్కోరుతో విజయం సాధించారు.

వీరుతదుపరి రౌండ్‌లో ప్రెస్లీ స్మిత్‌, జి యి చెన్‌ జోడీని ఎదుర్కొంటారు. మహిళల డబుల్స్‌లో 95వ ర్యాంకులో ఉన్న భారతజోడీ రుతుపర్ణ పాండా, శ్వేత్‌పర్ణపాండా 21-15, 15-21, 9-21 తేడాతో కెనడియన్‌లు జాక్వెలిస్‌, జెస్లిన్‌ చేతిలో పరాజయం పాలయ్యారు. పీవీ సింధు,లక్ష్యసేన్‌ సహా ఇతర భారత టాప్‌ షట్లర్లు నేడు (బుధవారం) బరిలోకి దిగనున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement