Thursday, May 2, 2024

Breaking | పల్నాడు జిల్లాలో దారుణం.. తల్లీ, కూతుళ్ల దారుణ హత్య

సత్తెనపల్లి రూరల్‌, ప్రభన్యూస్‌: పల్నాడు జిల్లా సత్తెనపల్లి మండలం ధూళిపాళ్ల గ్రామంలో దారుణం చోటు చేసుకుంది. తల్లీ, కూతుళ్లను వారి బంధువులు గొడ్డలి, రాడ్డులతో దాడిచేసి దారుణంగా హతమార్చారు.. ఈ ఘటనలో తల్లి అక్కడికక్కడే మృతిచెందగా, కుమార్తె సత్తెనపల్లి ప్రభుత్వ వైద్యశాలలో చికిత్స పొందుతూ మృతి చెందింది. గ్రామస్తులు, సత్తెనపల్లి రూరల్‌ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ధూళిపాళ్ల గ్రామానికి చెందిన షేక్‌ రహీమూన్‌(66),కుమార్తె మాలింబీ(36) ఇంట్లో వున్న సమయంలో వారి బంధువులు హుటాహుటిన ఇంట్లోకి ప్రవేశించి వాగ్వాదానికి దిగారు.

కొంతకాలంగావీరికి బంధువులకి మధ్య ఆస్తి విషయంలో విబేధాలు ఉన్నట్లు- చెబుతున్నారు. ఈ నేపథ్యంలో రహీమూన్‌ బంధువులు తమ వెంట తెచ్చుకున్న ఇనుప రాడ్లు, గొడ్డలితో దాడి చేశారు.ఈ దాడిలో రహీమూన్‌ అక్కడికక్కడే మృతి చెందగా తీవ్ర గాయలతో కొట్టు-మిట్టాడుతున్న మాలింబీ ని సత్తెనపల్లి ప్రభుత్వ వైద్యశాలకు తరలించగా అక్కడ చికిత్స పొందుతూ మరణించిందని పోలీసులు పేర్కొన్నారు. ఈ సమయంలో కుమారుడు రహమాన్‌ సత్తెనపల్లి లోని ఓక ప్రవేటు- పాఠశాల లో ఉద్యోగ బాధ్యతలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

కాగా ఘటనా స్థలాన్ని సత్తెనపల్లి రూరల్‌ సిఐ చి-్టట-ం కొటేశ్వరరావు,ఎస్‌ ఐ ఆవుల బాలక్రిష్ణ లు తమ సిబ్బందితో కలసి ఘటన స్ధలాన్ని సందర్శించి వివరాలు అడిగి తెలుసుకున్నారు.. తల్లీ, కూతుళ్ళ హత్యకు ఆస్తి తగాదాల,వేరే కారణాలు ఏమైనా ఉన్నాయోనని పోలీసులు విచారణ జరుపుతున్నారు. తల్లీ, కూతుళ్ళ మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం సత్తెనపల్లి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. సత్తెనపల్లి రూరల్‌ పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement