Thursday, May 2, 2024

Breaking: మ‌లేషియా ఓపెన్‌లో అద‌ర‌గొడుతున్న‌ సింధు.. రెండో రౌండ్‌లోనే వెనుదిరిగిన సైనా

భారత స్టార్ షట్లర్ సైనా నెహ్వాల్ మలేషియా ఓపెన్ తొలి రౌండ్‌లోనే వెనుతిరిగింది. అమెరికాకు చెందిన ఐరిస్ వాంగ్‌తో తలపడిన సైనా.. ఏ దశలోనూ మెరుగైన ఆట‌తీరు క‌న‌బ‌ర‌చ‌లేక‌పోయింది. వరుస సెట్లలో 11-21, 17-21 పాయింట్లతో ఓటమి చవిచూసింది. దీంతో మలేషియా ఓపెన్‌లో సైనా కథ ముగిసినట్లే అని చెప్ప‌వ‌చ్చు. అయితే.. మరో స్టార్ షట్లర్ పీవీ సింధు మాత్రం ఈ టోర్నీలో శుభారంభం చేసింది. తొలి రౌండ్‌లో థాయిలాండ్‌కు చెందిన పోన్‌పావీ చోచువోంగ్‌పై ఈజీగా గెలిచిన సింధు.. రెండో రౌండ్‌లోకి అడుగుపెట్టింది. చోచువాంగ్‌తో జరిగిన మ్యాచ్‌లో పూర్తి ఆధిపత్యం ప్రదర్శించిన ఆమె 21-13, 21-17 తేడాతో వరుస సెట్లు సాధించి మ్యాచ్‌ని తన ఖాతాలో వేసుకుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement