Sunday, April 28, 2024

జూలై 1న – ఓటీటీలో విరాట‌ప‌ర్వం

జూలై 1న నెట్ ప్లిక్స్ లో విరాట‌ప‌ర్వం చిత్రం స్ట్రీమింగ్ కానుంది. ఈ చిత్రం ఓటిటీ హక్కులను రూ. 15 కోట్లకు నెట్ ఫ్లిక్స్ చేజిక్కించుకుంది. రానా దగ్గుబాటి, సాయిపల్లవి హీరో, హీరోయిన్లుగా నటించిన చిత్రం విరాటపర్వం. వేణు ఊడుగుల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా జూన్ 17న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. నక్సల్ బ్యాక్ డ్రాప్ లో సాగే ప్రేమ కథ. 1990 లో జరిగిన కొన్ని నిజ సంఘటనలను ఆధారంగా చేసుకొని ఈ సినిమాను తెరకెక్కించారు. నక్సల్ దళ నాయకుడు రవన్న పాత్రలో రానా నటిస్తే.. అతని ప్రేమించే అమ్మాయి వెన్నెల పాత్రలో సాయి పల్లవి నటించింది. విప్లవ నాయకుడిని ప్రేమించిన అమ్మాయి అతని కోసం ఏం చేసింది అనేదే కథాంశం.

Advertisement

తాజా వార్తలు

Advertisement