Sunday, May 19, 2024

స‌చిన్ ఫౌండేష‌న్ పేరుతో స్కూల్.. 2300మంది పిల్ల‌ల‌కు ఉచిత విద్య‌

స‌చిన్ టెండూల్క‌ర్ క్రికెట్ లోనే కాదు సామాజిక‌సేవ‌లో కూడా పేరు తెచ్చుకుంటున్నారు. ఇప్పటికే నెల్లూరు జిల్లా పుట్టంరాజుకండ్రిగ గ్రామాన్ని దత్తత తీసుకుని దానిని అభివృద్ధి చేసిన సంగతి తెలిసిందే . తాజాగా మరో మహత్తర సహాయ కార్యక్రమానికి సచిన్ టెండూల్కర్ శ్రీకారం చుట్టనున్నారు. మధ్యప్రదేశ్ లోని సచిన్ టెండూల్కర్ ఫౌండేషన్ పేరుతో సందల్ పూర్ లో ఒక పాఠశాలను నిర్మించడానికి సన్నాహాలు చేస్తున్నారు. కాగా ఈ పాఠశాల వల్ల రానున్న 10 సంవత్సరాలలో దాదాపుగా 2300 మంది పిల్లలకు ఉచిత విద్య అందనుంది. సచిన్ తలపెట్టిన ఈ గొప్ప కార్యక్రమం సక్సెస్ కావాలని ఆశిద్దాం. తన తల్లితండ్రులను ఎంతగానో ఇష్టపడే వారికీ ఈ స్కూల్ ను అంకితం ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఈ కార్యక్రమం పట్ల హ్యాపీ ఫీల్ అవుతున్న ఫ్యాన్స్ సచిన్ ను అభినందిస్తూ సోషల్ మీడియాలో మెసేజ్ లు పంపుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement