Sunday, May 5, 2024

షారుక్ ఖాన్ బిహేవియ‌ర్ పై.. నెటిజ‌న్ల ఫైర్

ద‌ర్శ‌కుడు రాజ్ కుమార్ హిరానీ డుంకీ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో స్టార్ హీరో షారుక్ ఖాన్ న‌టిస్తుండ‌గా..హీరోయిన్ గా తాప్సీ న‌టిస్తోంది.కాగా ఇతర తారాగణంతో పాటు చిత్రం షెడ్యూల్ ని పూర్తి చేయడానికి ఇటీవల కాశ్మీర్ కి వెళ్లారు. షూటింగ్ లో కొంత భాగాన్ని ముగించుకుని ముంబైకి తిరిగి వచ్చారు. దీంతో ముంబయి ఎయిర్ పోర్టులో ఆయన ఫ్యాన్స్ కి కనిపించారు. దీంతో ఆయనతో సెల్ఫీలు దిగేందుకు ఫ్యాన్స్ అత్యుత్సాహం చూపించారు.ఆన్ లైన్ లో షేర్ చేసిన వీడియోలో సూపర్ స్టార్ తనతో సెల్ఫీ తీసుకోవడానికి ప్రయత్నిస్తున్న అభిమాని ఫోన్ ని అనుకోకుండా ఫ్లిక్ చేశాడు. ఇప్పుడు ఈ వీడియో వైరల్ గా మారింది. దీంతో ఆ వీడియోని చూసి నెటిజన్లు షారూఖ్ పై విమర్శలు కురిపిస్తున్నారు.
ఫ్యాన్స్ తో షారూఖ్ ప్రవర్తిచిన తీరు సరిగా లేదని అభిప్రాయపడుతున్నారు. మరి కొందరు మాత్రం షారూఖ్ కావాలని చేయలేద‌ని అది పొరపాటుగా జరిగిందని సమర్థిస్తున్నారు. మరి ఈ వివాదంపై ఆయన ఎలా స్పందిస్తారో చూడాలి. కాగా షారూఖ్ త్వరలోనే జవాన్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాకి అట్లీ దర్శకత్వం వహించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement