Wednesday, May 15, 2024

వన్డే ర్యాంకింగ్స్‌లో మెరుగైన రోహిత్ శ‌ర్మ‌.. 2, 3వ స్థానాల్లో విరాట్‌, రోహిత్‌

దుబాయ్‌ : ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో రోహిత్‌ శర్మ మెరుగయ్యాడు. తన ఖాతాలో పాయింట్లు పెంచుకున్నాడు. తాజాగా ప్రకటించిన ర్యాంకింగ్స్‌లో తొలి మూడు స్థానాల్లో ఉన్న బాబర్‌ ఆజమ్‌, విరాట్‌ కోహ్లీ, రోహిత్‌ శర్మల మధ్య ఎలాంటి మార్పు లేదు. అయితే విండీస్‌తో జరిగిన తొలి వన్డేలో అర్ధ సెంచరీతో రోహిత్‌ శర్మ ఆకట్టుకున్నాడు. టీమిండియా విజయంలో కీలక పాత్ర పోషించాడు. దీంతో రోహిత్‌ ఖాతాలో కేవలం 2 పాయింట్లు యాడ్‌ అయ్యాయి. 873 పాయింట్లతో బాబర్‌ ఆజమ్‌ టాప్‌లో ఉన్నాడు. 828 పాయింట్లతో విరాట్‌, 807 పాయింట్లతో రోహిత్‌ రెండు, మూడో స్థానంలో కొనసాగుతున్నారు.

డికాక్‌ (783), ఫించ్‌ (779), బెయిర్‌ స్టో (775), వార్నర్‌ (762)లు తరువాతి స్థానాల్లో ఉన్నారు. బౌలింగ్‌ విభాగంలో బౌల్ట్‌ (737) టాప్‌లో ఉన్నాడు. ఇక భారత్‌ నుంచి టాప్‌-10లో ఒకే ఒకడు బుమ్రా ఉన్నాడు. అతని ఖాతాలో 686 పాయింట్లు ఉన్నాయి. వన్డే ఆల్‌ రౌండర్‌ కేటగిరిలో షకీబుల్‌ హసన్‌ (416)టాప్‌లో ఉన్నాడు. టీమిండియా నుంచి రవీంద్ర జడేజా (229) 8వ స్థానంలో కొనసాగుతున్నాడు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement