Friday, May 3, 2024

IPL 2024: రిషబ్ పంత్ వ‌చ్చేస్తున్నాడోచ్..

ఐపీఎల్ 2024 సీజన్ ప్రారంభ సమయం దగ్గర పడుతోంది. ఈనెల 22 నుంచి ఐపీఎల్ 17వ ఎడిషన్ మ్యాచ్ లు ప్రారంభం కానున్నాయి. 74 రోజుల పాటు యావత్ క్రికెట్ ప్రపంచాన్ని ఉర్రూతలూగించేందుకు క్రికెటర్లు సన్నద్ధం అవుతున్నారు. ఈ ఐపీఎల్ లో టీమిండియా ప్లేయర్ రిషబ్ పంత్ సిక్సర్ల మోతకోసం అభిమానులు ఎదురు చూస్తున్నారు. ఢిల్లీ క్యాపిటల్స్ తరపున పంత్ ఐపీఎల్ 2024 సీజన్ లో మైదానంలోకి రాబోతున్నారు. చాలాకాలం తరువాత పంత్ ఐపీఎల్ లోకి తిరిగి వస్తుండటంతో అభిమానులుసైతం పంత్ బ్యాటింగ్ ను వీక్షించేందుకు ఎదురు చూస్తున్నారు. అయితే, ఐపీఎల్ మ్యాచ్ కు ముందే పంత్ ప్రాక్టీస్ సెషన్ లో సిక్సర్ల మోత మోగిస్తున్నాడు.. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ప్రాక్టీస్ సెష‌న్ లో ఒంటిచేత్తో సిక్స‌ర్ల మోత ..
టీమిండియా వికెట్ కీపర్, ఐపీఎల్ లో ఢిల్లీ క్యాపిటల్స్ ఒకప్పటి కెప్టెన్ రిషబ్ పంత్ గతేడాది ఘోర కారు ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో పంత్ మోకాలి, వీపుపై బలమైన గాయాలయ్యాయి. దీంతో వైద్యులు పంత్ కు శస్త్ర చికిత్స నిర్వహించారు. గత సంవత్సర కాలంగా క్రికెట్ కు దూరంగా ఉంటున్న పంత్.. ఈ ఏడాది ప్రారంభం నుంచి ప్రాక్టీస్ సెషన్ లో పాల్గొంటున్నారు. ఎన్సీఏలో ప్రాక్టీస్ మ్యాచ్ లో పంత్ తన సత్తాను చాటుతున్నాడు. ఈ క్రమంలో పంత్ భారీ సిక్స్ కొట్టాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ప్రాక్టీస్ మ్యాచ్ లలో పంత్ దూకుడు చూసి ఈసారి ఐపీఎల్ లో పంత్ సిక్సర్ల మోత ఖాయమని అభిమానులు ఆశగా ఎదురు చూస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement