Thursday, May 16, 2024

ఊత క‌ర్ర సాయం లేకుండా న‌డుస్తున్న రిష‌బ్ పంత్ – వీడియోతో

రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ టీమిండియా స్టార్ బ్యాటర్ రిషబ్ పంత్ వేగంగా కోలుకుంటున్నాడు. గతేడాది జరిగిన కారు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ ఈ వికెట్ కీపర్ ఆ నాటి నుండి కర్రసాయంతో నడుస్తున్నాడు.. ప్రస్తుతం ఆ అవసరం లేకుండానే అడుగులు వేస్తున్నాడు. తాజాగా పంత్ వీడియో పోస్టు చేశాడు. వేగంగా కోలుకుంటున్నాననే విషయాన్ని చెబుతూ కర్ర సాయం లేకుండా నడుస్తున్న వీడియోను పంచుకున్నాడు. ఆ వీడియోలో మొదట కర్ర సాయంతో స్లోగా నడుచుకుంటున్న వచ్చిన రిషబ్ పంత్.. ఆ తర్వాత అక్కడే ఉన్న ఫిజియోకు కర్ర విసిరేశాడు. అనంతరం వేగంగా నడవడం ప్రారంభించాడు. కర్ర లేకున్నా నడవడంలో పంత్ పెద్దగా ఇబ్బంది పడలేదు. ఈ వీడియోను సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేసిన పంత్ ఇక ఊతకర్ర సాయం అక్కర్లేదు అంటూ క్యాప్షన్ ఇచ్చాడు.


ఇది ఇలా ఉంటే రూర్కీ సమీపంలో గతేడాది డిసెంబర్ 30న రిషబ్ పంత్ రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. ఢిల్లీ నుండి రూర్కీకి కారులో వెళ్తుండగా ఆ వాహనం ఒక్కసారిగా హైవేపై బోల్తా పడింది. తర్వాత కారు మంటల్లో కాలిపోగా పంత్ ప్రాణాలతో బయటపడ్డాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement