Saturday, May 18, 2024

IPL | రెండు మ్యాచ్‌ల‌ రీ-షెడ్యూల్…

ఐపీఎల్ 2024 17వ సీజన్ మార్చి 22న ప్రారంభం కాగా… మ్యాచ్‌లు హోరాహోరీగా సాగుతున్నాయి. ఇక, ఈ సీజన్‌కు సంబంధించిన పూర్తి షెడ్యూల్‌ను బీసీసీఐ ఇప్పటికే రెండు దశల్లో విడుదల చేసింది. అయితే తాజాగా ఈ షెడ్యూల్‌లో మార్పులు చేసినట్టు బీసీసీఐ వెల్లడించింది. రెండు మ్యాచ్‌లను రీషెడ్యూల్ చేసినట్టు తెలిపింది. ఈ నెల 17న శ్రీరామనవమి కావడంతో షెడ్యూల్‌లో మార్పులు చేసినట్లు తెలుస్తోంది.

షెడ్యూల్ ప్రకారం… ఏప్రిల్ 16న అహ్మదాబాద్ వేదికగా గుజరాత్ టైటాన్స్, ఢిల్లీ క్యాపిటల్స్.. 17న కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్‌లో రాజస్థాన్ రాయల్స్, కోల్‌కతా నైట్ రైడర్స్ జట్లు తలపడనున్నాయి. అయితే 17వ తేదీ శ్రీరామనవమి కావడంతో ఆ రోజు భద్రత కల్పించలేమని పోలీసులు బెంగాల్ క్రికెట్ అసోసియేషన్‌కు సమాచారం అందించారు. దీంతో 17న జరగాల్సిన కేకేఆర్ – ఆర్ఆర్ మ్యాచ్ 16వ తేదీకి, 16న జరగాల్సిన గుజరాత్ వర్సెస్ ఢిల్లీ మ్యాచ్ 17వ తేదీకి మార్చారు. తేదీలు మారాయి తప్ప వేదికల్లో ఎలాంటి మార్పు లేదు.

Advertisement

తాజా వార్తలు

Advertisement