Sunday, May 5, 2024

NZB: అంగ రంగ వైభ‌వంగా వేంకటేశ్వర స్వామి వారి కళ్యాణ వేడుకలు…

నిజామాబాద్ రూరల్, ఎప్రిల్ 2 ప్రభ న్యూస్ : నిజామాబాద్ జిల్లా మొపాల మండలం నర్సింగపెల్లి శ్రీ వేంకటేశ్వర ఆలయంలో కళ్యాణ వేడుకలు ఘ‌నంగా నిర్వ‌హించారు. ఈ వేడుక‌ల్లో రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి పాల్గొని స్వామి వారి ఆశీర్వాదం తీసుకున్నారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా 4వ రోజు స్వామి వారి కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది… స్వామి వారి కల్యాణంలో పాల్గొంటే కన్యాదాన ఫలం వస్తుందని దేవనాథ జీయర్ స్వామి అన్నారు. ఉదయం యజ్ఞ కార్యక్రమం ముగిసిన తరువాత స్వామి వారి కళ్యాణం అంగరంగ వైభవంగా నిర్వహించారు.

గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొనడంతో పరిసరాలు భక్తులతో నిండిపోయాయి. ఈ కార్యక్రమాల్లో దేవనాథ జీయరు స్వామి, ఆచార్య గంగోత్రి రామానుజదాస్ స్వామి, రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి, ప్రముఖ నిర్మాత శిరీష్, సినీ హీరో ఆశిష్, నర్సింహారెడ్డి, విజయసింహ రెడ్డి, ఎంపీటీసీ రాములు, రవీందర్ యాదవ్, నర్సారెడ్డి, ప్రసాద్, రాజేశ్వర్, రమేష్, భాస్కర్, నరేందర్, మురళి, రాజేశ్వర్, యాజ్ఞాచార్యులు శిఖామణి, శ్రీకర్ కుమారాచార్యులు, రోహిత్ కుమారాచార్యులు, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement