Thursday, April 25, 2024

ఆర్సీబీ కెప్టెన్సీ నుంచి తప్పకోనున్న విరాట్ కోహ్లీ

విరాట్ కోహ్లీ మరో కీలక నిర్ణయం తీసుకున్నాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో రాయల్ ఛాలెంటజర్స్ బెంగళూరు సారథ్య బాధ్యతల నుంచి సైతం విరాట్ కోహ్లీ తప్పుకోనున్నాడు. ఐపీఎల్ 2021 సీజనే ఆర్సీబీ కెప్టెన్‌గా కోహ్లీకి చివరి సీజన్ కానుంది. ఆపై ఆటగాడిగా జట్టులో కొనసాగనున్నాడు. ఈ మేరకు కోహ్లీ నిర్ణయాన్ని ఆర్సీబీ ఇన్‌స్టాగ్రామ్ ద్వారా వెల్లడించింది. ఇటీవల అంతర్జాతీయ టీ20లకు టీమ్ ఇండియా కెప్టెన్సీ నుంచి 2021 టీ20 వరల్డ్ కప్ నుంచి తప్పుకోనున్నాడు. ఒత్తిడిని తట్టుకోలేక సతమతం అవుతున్న కోహ్లీ తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకున్నాడు. ఐపీఎల్ 2021 సీజన్ తో తన కెప్టెన్సీ ముగిస్తుందని వీడియో రూపంలో తెలిపాడు.

గత తొమ్మిదేళ్లుగా ఆర్సీబీకి సారథ్యం వహిస్తున్నాను. అయితే ఆటగాడిగా, కెప్టెన్ గా పూర్తి స్థాయిలో శక్తివంచన లేకుండా ప్రయత్నించాను. పని భారం పెరిగిన కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. ఆర్సీబీ కెప్టెన్సీ నుంచి తప్పుకుంటున్నానని మేనేజ్‌మెంట్‌కు నేటి సాయంత్రం నా నిర్ణయాన్ని వెల్లడించాను. తనకు ఇన్నిరోజులు మద్దతు తెలిపిన అభిమానులు, మేనేజ్ మెంట్, సహచర ఆటగాళ్లకు వీడియో ద్వారా ధన్యవాదాలు తెలిపాడు విరాట్ కోహ్లీ. ఆర్సీబీ కెప్టెన్‌గా తన జర్నీని చాలా ఎంజాయ్ చేశానని, ఈ ఐపీఎల్ సీజన్ తరువాత ఆటగాడిగా జట్టులో కొనసాగుతానని కోహ్లీ స్పష్టం చేశాడు.

ఇది కూడా చదవండి : బ్యాలెట్ బాక్సులో చీటీ.. కూల్ బీర్లు కావాలన్న మందుబాబు

Advertisement

తాజా వార్తలు

Advertisement