Tuesday, March 26, 2024

బ్యాలెట్ బాక్సులో చీటీ.. కూల్ బీర్లు కావాలన్న మందుబాబు

ఏపీలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల ఓట్ల లెక్కింపు నేడు చేపట్టిన సంగతి తెలిసిందే. అయితే, అనంతపురం జిల్లాలో ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. నల్లచెరువు మండలం తలమర్లవాండ్ల పల్లిలో కౌంటింగ్ జరుగుతుండగా, ఓ బ్యాలెట్ బాక్సులో ఓట్లతో పాటు ఓ చీటీ కూడా దర్శనమిచ్చింది. అది చదివిన కౌంటింగ్ సిబ్బంది అవాక్కయ్యారు. అది ఓ మందుబాబు రాసిన చీటీగా గుర్తించారు. రకరకాల మద్యం బ్రాండ్లతో విసిగిపోయామని తెలిపారు. నల్లచెరువు వైన్ షాపులో మంచి బ్రాండ్లు పెట్టాలని, కూలింగ్ ఉన్న బీర్లు అందుబాటులో ఉంచాలని ఆ వ్యక్తి విజ్ఞప్తి చేశాడు. ఇట్లు… నల్లచెరువు యూత్ మందుబాబుల అధ్యక్షుడు అని లేఖలో పేర్కొన్నాడు. ఆ వ్యక్తి తన ఓటుతో పాటు ఈ చీటిని కూడా బ్యాలెట్ బ్యాక్సులో వేశాడు.

ఇది కూడా చదవండి: రోహిత్​ శర్మ ను ఊరిస్తోన్న మరో రికార్డు..

Advertisement

తాజా వార్తలు

Advertisement