Friday, May 3, 2024

Para Badminton World | ఫైనల్స్‌కు భార‌త్ !

థాయ్‌లాండ్‌లోని పట్టాయాలో జరుగుతున్న పారా బ్యాడ్మింటన్‌ ప్రపంచ చాంపియన్‌షిప్‌లో భారత పారా షట్లర్లు ముగ్గురు ఫైనల్స్‌కు చేరారు. షట్లర్లు సుహాస్‌ యతిరాజ్‌, ప్రమోద్‌ భగవత్‌, కృష్ణనగర్‌ వివిధ విభాగాల్లో పురుషుల సింగిల్స్‌లో ఫైనల్స్‌ చేరుకున్నారు.

పారాలింపిక్‌ రజత పతక విజేత, ప్రపంచ నంబర్‌ 3 ర్యాంకర్‌ యతిరాజ్‌ సెమీఫైనల్‌లో ప్రపంచ నంబర్‌ 1 ర్యాంకర్‌ను ఓడించాడు. ఫ్రాన్స్‌ ఆటగాడు లుకాస్‌ మజుర్‌ పై 21-16, 21-19తో గెలుపొందాడు. తద్వారా కెరీర్‌లో తొలిసారి ఫైనల్స్‌లోకి అడుగుపెట్టారు. లుకాస్‌ ప్రపంచ చాంపియన్‌, పారాలింపిక్‌ స్వర్ణ పతక విజేత.

Advertisement

తాజా వార్తలు

Advertisement