Sunday, April 28, 2024

జాతీయ బాక్సింగ్ చాంపియ‌న్ షిప్.. బంగారు ప‌త‌కాన్ని సొంతం చేసుకున్న తెలంగాణ బాక్స‌ర్

జాతీయ బాక్సింగ్ చాంపియ‌న్ షిప్ లో బంగారు ప‌త‌కాన్ని సొంతం చేసుకున్నాడు తెలంగాణ స్టార్ బాక్స‌ర్ మ‌హ్మ‌ద్ హుస్సాముద్దీన్. పురుషుల 57 కిలోల విభాగంలో అతను జాతీయ చాంపియన్‌గా నిలిచాడు. సర్వీసెస్ తరఫున పోటీ పడ్డ హుస్సామ్ తుది పోరులో 4–1తో 2016 ప్రపంచ యూత్‌ చాంపియన్‌ సచిన్‌ (రైల్వేస్‌)ను చిత్తు చేశాడు. ఇదే టోర్నీలో గతేడాది రజతంతో సరిపెట్టిన తెలంగాణ బాక్సర్ ఈ సారి స్వర్ణంతోనే తిరిగొచ్చాడు. పోటాపోటీగా జరిగిన తుది పోరులో అతను తొలి రౌండ్‌ నుంచే అద్భుత ప్రదర్శన చేశాడు. తన అనుభవాన్ని ఉపయోగించి బలమైన పంచ్ లు విసురుతూ ప్రత్యర్థి సచిన్‌ ను ఓడించాడు. భారత మరో స్టార్ బాక్సర్ అస్సాంకు చెందిన శివ థాపా కూడా బంగారు పతకం గెలిచాడు. 63.5 కిలోల విభాగంలో బరిలోకి దిగిన థాపా ఫైనల్లో 5–0తో అంకిత్‌ నర్వాల్‌ (రైల్వేస్‌)ను చిత్తు చేశాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement