Monday, April 29, 2024

జూనియర్‌ నేషనల్‌ అక్వాటిక్‌ చాంపియన్‌షిప్స్‌.. వ్రితి అగర్వాల్‌కు స్వర్ణం, సాయి నిహార్‌కు రజతం

జాతీయ జూనియర్‌ స్విమ్మింగ్‌ పోటీల్లో తెలంగాణ స్విమ్మర్‌ వ్రితి అగర్వాల్‌ అద్భుతంగా రాణించింది. భువనేశ్వర్‌లో జరుగుతున్న అండర్‌-17 బాలికల 1500మీటర్ల ఫ్రీస్టయిల్‌ విభాగంలో వ్రితి 17ని:37:78 సెకన్లలో గమ్యానికి చేరి విజేతగా నిలిచింది. దీంతో వ్రితి అగర్వాల్‌ రెండో స్వర్ణ పతకం కైవసం చేసుకుంది.

ఈ టోర్నీలో అండర్‌-17 బాలుర 400 మీటర్ల మెడ్లీ ఈవెంట్‌లో తెలంగాణకు చెందిన బిక్కిన సాయి నిహార్‌ 4ని:40.08 సెకన్లలో గమ్యానికి చేరి రజతం కైవసం చేసుకున్నాడు. అండర్‌-14 బాలుర విభాగంలో 50 మీటర్ల బ్యాక్‌స్ట్రోక్‌లో సుహాస్‌ ప్రీతమ్‌ 28.51 సెకన్లలో గమ్యానికి చేరి రజతం పతకం చేజిక్కించుకున్నాడు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement