Sunday, April 28, 2024

తైపీ ఓపెన్‌, రెండో రౌండ్‌లోకి ఇషాన్‌- తనీషా జోడి

తైపీ ఓపెన్‌ 2022 బ్యాడ్మింటన్‌ చాంపియన్‌షిప్‌లో ఇండియన్స్‌ మిక్స్‌డ్‌ డబుల్స్‌ జోడి ఇషాన్‌ భట్నాగర్‌- తనీషా క్రాస్టో అద్భుతంగా రాణించింది. మంగళవారంనాడిక్కడ ఇజ్రాయిల్‌ జంట మిషా జిల్బెర్మన్‌- స్వెట్లాన జిల్బెర్మన్‌పై 21-15, 21-8 తేడాతో భారత్‌ జోడీ విజయం సాధించింది. రెండో రౌండ్‌లోకి దూసుకెళ్లింది. ఇక మెన్స్‌ సింగిల్స్‌ విభాగంలో శంకర్‌ ముత్తుస్వామి సుబ్రమణియన్‌, లియావో జూ ఫు (చైనీస్‌ తైపీ) చేతిలో 17-21, 23-21, 17-21 తేడాతో పరాజయం పాలయ్యాడు.

టోర్నీ నుంచి నిష్క్రమించాడు. గంట రెండు నిముషాలపాటు సాగిన హోరాహోరీ పోరులో ప్రత్యర్థి దాటికి శంకర్‌ ముత్తుస్వామి నిలబడలేకపోయాడు. దీంతోనే ఓడిపోయి టోర్నీ నుంచి వైదొలగాడు. ఇక లండన్‌ 2012 కాంస్యం పతక విజేత సైనా నెహ్వాల్‌ టోర్నమెంట్‌ నుంచి వైదొలగింది. రెండుసార్లు ఒలింపిక్‌ మెడలిస్ట్‌ పీవీ సింధు టోర్నీలో పాల్గొనడం లేదని సమాచారం. ఇక మరో భారత దిగ్గజ షట్లర్‌ పారుపల్లి కశ్యప్‌ బుధవారంనాడు తొలి మ్యాచ్‌ ఆడనున్నాడు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement