Sunday, April 28, 2024

IND vs ENG : జైశ్వ‌ల్ డ‌బుల్ ద‌క్కా… స‌ర్ఫారాజ్ హాఫ్ సెంచ‌రీ..

రాజ్‌కోట్‌: య‌శస్వీ జైశ్వాల్ డ‌బుల్‌సెంచ‌రీ చేశాడు. ఈ సీరిస్‌లో ఇది రెండో డ‌బుల్ సెంచ‌రీ. నాలుగోరోజు క్రీజులోకి వ‌చ్చిన‌ప్పటీ నుంచి జైశ్వాల్ ఇంగ్లండ్ బౌల‌ర్ల‌పై విరుచుకుప‌డ్డాడు. 231బంతుల్లోనే అత‌డు డ‌బుల్ సెంచ‌రీని పూర్తి చేశాడు. ఈ మ్యాచ్ లో 214 ప‌రుగుల‌తో అజేయంగా నిలిచారు.. అటు య‌శ‌స్వీ, స‌ర్ప‌రాజ్ ఖాన్ లు ధ‌నాధ‌న్ బ్యాటింగ్ తో నాలుగు వికెట్లు న‌ష్టానికి 430 ప‌రుగులు చేసి రెండో ఇన్నింగ్స్ ను డిక్లేర్ చేసింది.. ఇంగ్లండ్ ఈ మ్యాచ్ గెల‌వాలంటే 556 ప‌రుగులు చేయాల్సి ఉంది.. ఇంకా ఆట‌కు ఒక‌టిన్న‌ర రోజులు మిగిలి ఉంది.. ఇక నేడు గిల్ 91 , కుల‌దీప 26 ప‌రుగులు చేసి ఔట‌య్యారు.. స‌ర్ఫ‌రాజ్ ఖాన్ 68 ప‌రుగుల‌తో నాటౌట్ గా నిలిచారు..

Advertisement

తాజా వార్తలు

Advertisement