Saturday, May 11, 2024

ITF టెన్నిస్ టోర్నీ.. శ్రీవల్లీ జోడీకి టైటిల్..

ఇండోర్ టెన్నిస్ క్లబ్‌లో ఇవ్వాల (శనివారం) జరిగిన ఐటీఎఫ్ మహిళల టెన్నిస్ టోర్నమెంట్ ఫైనల్స్‌లో భారత మహిళల జోడీ శ్రీవల్లి భమిడిపాటి-వైదేహి చౌదరి విజయం సాధించారు. ఫైనల్స్‌లో లీ యా-హ్సువాన్ – సోహ్యున్ పార్క్ జంటను 6-3, 7-5 పాయింట్ల తేడాతో ఓడించి మహిళల డబుల్స్ టైటిల్‌ను గెలుచుకున్నారు. శ్రీవల్లి, వైదేహి జంటగా ఇది వారికి మూడో టైటిల్‌.

మహిళల సింగిల్స్‌ ఫైనల్స్‌లో శ్రీవల్లి

మరోవైపు మహిళల సింగిల్స్‌లోనూ శ్రీవల్లి భమిడిపాటి ఫైనల్స్‌కు చేరుకుంది. ఇవ్వాల జరిగిన సెమీఫైనల్ మ్యాచ్‌లో 6-3, 6-4 పాయింట్ల తేడాతో పోలినా ఇట్సెంకోపై విజయం సాధించి సింగిల్స్ ఫైనల్‌కు చేరుకుంది. కాగా, రేపు (ఆదివారం) జరిగే ఫైనల్స్‌లో దలీలా జకుపోవిచ్‌తో పోటీపడనుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement