Wednesday, May 15, 2024

INDvsENG | టెస్టు జట్టులోకి సర్ఫరాజ్‌, సౌరబ్‌లకు పిలుపు !

ఇంగ్లండ్‌తో జరుగుతున్న 5 మ్యాచ్‌ల టెస్ట్‌ సిరీస్‌లో సెకండ్‌ టీమిండియాకు గట్టి షాక్‌ తగిలింది. హైదరాబాద్‌లో జరిగిన తొలి టెస్టు నాలుగో రోజు రవీంద్ర జడేజా, కేఎల్‌ రాహుల్ గాయపడ్డారు. దీంతో ఫిబ్రవరి 2నుంచి ప్రారంభమయ్యే రెండో టెస్టుకు దూరమయ్యారు. వారి స్థానంలో సర్ఫారాజ్‌ ఖాన్‌, సౌరభ్‌ కుమార్‌, వాషింగ్టన్‌ సుందర్‌లను జట్టులోకి తీసుకుంది సెలెక్షన్‌ కమిటీ. ఈ విషయాన్ని బీసీసీఐ మీడియాకు వెల్లడించింది.

కొత్తగా జట్టులోకి వచ్చిన ముగ్గురిలో సర్ఫరాజ్‌, సుందర్‌ ఇటీవల ఇంగ్లండ్‌ లయన్స్‌ జట్టుతో మూడు టెస్టుల సిరీస్‌లో తలపడిన భారత్‌-ఎ జట్టులో సభ్యులుగా ఉన్నారు. అహ్మదాబాద్‌లో జరిగిన రెండో టెస్టులో సర్ఫరాజ్‌ 161 పరుగుల భారీ సెంచరీ సాధించాడు. సుందర్‌ రెండు వికెట్లు తీసుకున్నాడు. దాంతో ఇంగ్లండ్‌ లయన్స్‌పై భారత్‌-ఎ జట్టు ఇన్నింగ్స్‌ 16 పరుగుల తేడాతో విజయం సాధించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement