Tuesday, May 7, 2024

Cricket | భారత్‌- వెస్టిండీస్‌ టెస్టు సిరీస్‌.. రంగంలోకి విండీస్‌ బాహుబలి

భారత్‌, వెస్టిండీస్‌ జట్ల మధ్య రెండు మ్యాచ్‌ల టెస్ట్‌ సిరీస్‌ ఈ నెల 12 నుంచి ప్రారంభంకానుంది. సిరీస్‌ కోసం బీసీసీఐ ఇప్పటికే భారత జట్టును ప్రటించింది. తాజాగా వెస్టిండీస్‌ కూడా 13 మందితో కూడిన తమ టీమ్‌ను ఎంపిక చేసింది. అయితే మొదటి టెస్టు కోసమే జట్టును ఎంపిక చేయడం విశేషం. కెప్టెన్‌గా క్రెగ్‌ బ్రాట్‌వైట్‌ కొనసాగుతుండగా.. విండీస్‌ బాహుబలి క్రికెటర్‌గా గుర్తింపు తెచ్చుకున్న రఖీమ్‌ కార్న్‌వాల్‌ను తిరిగి టెస్టు జట్టులోకి తీసుకుంది. వన్డే వరల్డ్‌కప్‌కు అర్హత సాధించడంలో వెస్టిండీస్‌ విఫలమైన సంగతి తెలిసిందే. దీంతో టీమిండియాతో టెస్ట్‌ సిరీస్‌ కోసం సీనియర్లకు ఉద్వాసన పలికిన వెస్టిండీస్‌ క్రికెట్‌ బోర్డ్‌ దాదాపు అందరూ కొత్త ప్లేయర్స్‌కు అవకాశం ఇచ్చింది.

ఇందులో బ్రాత్‌వైట్‌, హోల్డర్‌, కీమర్‌ రోచ్‌ మినహా మిగిలిన వారందరూ కొత్తవాళ్లే కావడం గమనార్హం. ఎవరికి పట్టుపది పది మ్యాచ్‌లు ఆడిన అనుభవం కూడా లేదు. ఈ టెస్ట్‌ సిరీస్‌ ద్వారా మెకంజీ, అంతాంజే అంతర్జాతీయ క్రికెట్‌లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారు. కాగా, రకీం కార్న్‌వాల్‌ 2021 తర్వాత దేశానికి ప్రాతినిథ్యం వహస్తుండటం ఇదే మొదటిసారి. ఆల్‌రౌండర్‌ అయిన రకీం.. 2019లో భారత జట్టుపైనే ఆరంగేట్రం చేయడం విశేషం. లెప్ట్‌n ఆర్మ్‌ స్పిన్నర్‌ ట్వీకర్‌ జోమెల్‌ వారికన్‌కు జట్టులో స్థానం కల్పించారు. వీరితోపాటు రిజర్వ్‌ ఆటగాళ్లుగా టెవిన్‌ ఇవ్లూచ్‌, అకీమ్‌ జోర్డాన్‌ ఉన్నారు. తొలి టెస్టుకు విడీస్‌ జట్టు: క్రెగ్‌ బ్రాత్‌వైట్‌ (కెప్టెన్‌), జెర్మైన్‌ బ్లాక్‌వుడ్‌ (వైస్‌ కెప్టెన్‌), అలిక్‌ అథనాజ్‌, తగ్‌నరన్‌ చందర్‌పాల్‌, రకీం కార్న్‌వాల్‌, జాషువా డా సిల్వా, షానన్‌ గాబ్రియేల్‌, జేసన్‌ హూల్డర్‌, అల్జారీ జోసఫ్‌, కిర్క్‌ మెకంజీ, రేమన్‌ రీఫర్‌, కీమర్‌ రోచ్‌, జోమెల్‌ వారికాన్‌.
రిజర్వ్‌ ఆటగాళ్లు: టెవిన్‌ ఇవ్లూచ్‌, అకీమ్‌ జోర్డాన్‌.

Advertisement

తాజా వార్తలు

Advertisement