Monday, May 13, 2024

French Open | క్వార్ట‌ర్స్‌కు భారత్..

ఫ్రెంచ్ ఓపెన్ సూపర్ 750 బ్యాడ్మింటన్ టోర్నీలో భారత్ క్వార్టర్ ఫైనల్స్‌కు చేరుకుంది. ఇవ్వాల‌ జరిగిన మహిళల సింగిల్స్ మ్యాచ్‌లో పీవీ సింధు విజయం సాధించింది. చైనా క్రీడాకారిణి బివెన్ జాంగ్‌తో తలపడిన సింధు 13-21, 21-10, 21-14 పాయింట్ల తేడాతో విజయం సాధించింది. అలాగే మహిళల డబుల్స్‌లో ట్రెసా – గాయత్రి జోడీ 18-21, 13-21 పాయింట్ల తేడాతో జపాన్‌కు చెందిన యుకీ ఫుకుషిమా-సయాకా హిరోటా జోడీపై వరుస సెట్లలో విజయం సాధించి క్వార్ట‌ర్స్ కు చేరుకుంది.

అయితే పురుషుల సింగిల్స్‌లో భారత ఆటగాడు కితాంబి శ్రీకాంత్‌ నిరాశపరిచాడు. రెండో రౌండ్‌లో చైనాకు చెందిన లు గువాంగ్‌జు చేతిలో 21-19, 12-21, 20-22 పాయింట్ల తేడాతో ఓడిపోయాడు. పురుషుల డబుల్స్‌లో చిరాగ్ – సాత్విక్, పురుషుల సింగిల్స్‌లో లక్ష్య సేన్ త్వరలో తమ రెండో రౌండ్ మ్యాచ్ ఆడనున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement